సాక్షి, ఉక్కునగరం (గాజువాక): విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఆదివారం మధ్యాహ్నం నగరానికి రానున్నారు. సాయంత్రం స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ఉక్కు స్టేడియంలో పిల్లలతో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ను ప్రారంభిస్తారు. తర్వాత ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం వెళ్లి పిల్లలతో ముచ్చటించనున్నారు.