న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో నిందితుల మృతదేహాల వద్ద నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 15 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్లుగా