సాక్షి, న్యూఢిల్లీ: జడ్జిల భద్రతకు సంబంధించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జడ్జిల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.