Latest Breaking News On - நடத்தை நடவடிக்கை - Page 1 : vimarsana.com
వేదిక మార్చి సమవేశమైన కార్మిక నేతలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంలో విలీనం అనంతరం నెలకొన్న సమస్యలను చర్చించేందుకు సమావేశమైన కార్మికసంఘాల నేతలపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిఘా పెట్టింది. మంగళవారం నాడు విజయవాడలోని అశోకా హోటల్లో ఈ సంఘాల సమావేశం జరగాల్సిఉండగా ఆ పరిసర ప్రాంతాలన్నీ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ లతో పాటు సాధారణ పోలీసులతో నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన కార్మిక సంఘాలు చివరిక్షణంలో తమ సమావేశాన్ని ఆ హోటల్ నుండి వేరే ప్రాంతానికి మార్చాల్సివచ్చింది. ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఆర్టిసి కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. యాజమాన్యంతో మాట్లాడుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే, ప్రభుత్వంతో చర్చించుకోండని యాజమాన్యం అంటోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా కార్యాచరణ కోసం చర్చించుకుంటున్న కార్మికసంఘాలు మంగళవారం ప్రత్యక్షంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. దీనికి అశోకా హోటల్ను వేదికగా తొలుత నిర్ణయించినప్పటికీ భారీ నిఘా నేపథ్యంలో అక్కడి నుండి వేరే ప్రాంతానికి సమావేశాన్ని అప్పటికప్పుడు మార్చారు. ఆర్టీసిలో 9 రిజిస్టర్ సంఘాలుండగా, మొత్తం 19 సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయినట్లు తెలిసింది. వీటలో నాలుగు సంఘాలు మినహా మిగిలిన సంఘాలు సమస్యలపై తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ విలీనంతో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగులుగా అనుభవిస్తున్న సదుపాయాలతో పాటు పెన్షన్ వంటి అదనపు ప్రయోజనాల కోసం విలీనం కోరుకుంటే దీనికి విరుద్ధంగా సాగుతోందని కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని సంఘాలు కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోసారి సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే ఆలోచనలో కార్మిక సంఘాలు వున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Conduct-activityநடத்தை-நடவடிக்கை