Vimarsana.com

శ ర ల న క : Live & Latest News Updates : Vimarsana.com

శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు

శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణానదిలో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు అన్ని జలాశయాల వద్ద ఇరవై వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలానికి 21 వేల క్యూసెక్కులు వస్తుండగా విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు 9,589 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 13 వేలు, ఆలమట్టికి 21 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నారాయణపూర్‌నకు 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి జూరాలకు 21 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల వద్ద 25 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. గోదావరి పరీవాహకంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లి జలాశయానికి అక్కడి నుంచి మధ్యమానేరు జలాశయానికి నీటి తరలింపు కొనసాగుతోంది. మధ్యమానేరుకు 15,290, ఇక్కడి నుంచి స్పిల్‌వే ద్వారా దిగువ మానేరు జలాశయానికి 14,558 క్యూసెక్కులు వస్తున్నాయి. Tags :

Godavari
Andhra-pradesh
India
శ-ర-ల-న-క-
1
Enadu
State-news
Ain-news
Eneral
702
21130883

vimarsana © 2020. All Rights Reserved.