న్యూఢిల్లీ : రోజువారీగా నమోదవుతున్న కేసులు హెచ్చుతగ్గులుగా నమోదవుతున్నాయి. క్రితం రోజు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. శుక్రవారం ఒక్కరోజే 38,628 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ఇక గడచిన ఇరవై నాలుగు గంటల్లో 617 మంది కోవిడ్తో మరణించారు. మొత్తం మరణల సంఖ్య 4,27,371కి చేరింది. ఇక మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. కరోనా కేసులు అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కేరళలో 19,948 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్రలో 5,539 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.