ప్రధానాంశాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల్ని మోసగిస్తోన్న తెరాస ప్రభుత్వం 30న ఇందిరాపార్క్ వద్ద ధర్నా: భాజపా ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తెరాస వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాల్ని మోసగిస్తోందని భాజపా విమర్శించింది. హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డితో కలిసి ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోడు భూముల్ని సాగు చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. పోడు రైతులకు భాజపా అండగా ఉంటుందన్నారు. Tags :