సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నందున, దశల వారీగా మిగిలిన తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను నవంబర్ మొదటి వారంలో తిరిగి