లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఇటీవల జరిగిన ముస్లిం వృద్ధుడి దాడి ఘటనపై మత అశాంతిని రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వారంలోగా లోని బోర్డర్ పోలీస్ స్టేషన్కు వచ్చి..స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనపై ట్విట్టర్, ద వైర్ జర్నలిస్టులు, పలురువు కాంగ్రెస్ నేతలపై ఘజియాబాద్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.