మౌనాన్ని &#x

మౌనాన్ని ధ్వంసం చేసే కవి


మౌనాన్ని ధ్వంసం చేసే కవి
ఆ  నది ఒక్కోసారి మౌనంగా ప్రవహిస్తుంటుంది, మరో సారి పరవళ్లు తొక్కుతుంది. ఒక సారి పసిపిల్లల పాదాలు తడుముతుంది. ఇంకొక సారి నెత్తుటిని మోసుకుంటూ వస్తుంది. పచ్చని చేలను తడిమే ఆ నది నీళ్లలో ఎన్నో జీవన గాథలు ఉన్నాయి. ఎన్నో త్యాగాల గీతాలూ ఉన్నాయి. ఎన్నో పోరాటాల నినాదాల ప్రతిధ్వనులూ ఉన్నాయి. ఆ నది మానేరు. ఆ నది గలగలల్లో ఒక గొంతు కొన్ని దశాబ్దాలుగా వినపడుతోంది. అది వేనవేల గొంతుల్ని ఇముడ్చుకుని ఆ నీరు తడిపిన మట్టి వాసనను మనకు అందిస్తుంది. ఆ గొంతు ఎవరిదో కాదు మన జూకంటి జగన్నాథంది.
‘‘ఎవరి మట్టి మీద వాళ్లు స్మృతి గీతం ఆలపించడమంటే ఎవరి అన్నం మెతుకుపైన వాళ్ల ఆత్మను ఆవిష్కరించుకోవడం’’ అని నినదించే జూకంటి తనతో పాటు చరిత్రను మోసుకు వచ్చాడు.  అది ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసిన చరిత్ర. ఎందరి బతుకుల్నో ప్రశార్థకం చేసిన చరిత్ర. కాని ఈ రగిలిన మంటల్లో, ఈ ప్రశ్నల్లో కొన్ని అస్తిత్వ సంఘర్షణలు ఉన్నాయి. కొన్ని రైతాంగ పోరాటాలు ఉన్నాయి. కొన్ని దురాక్రమణ పర్వాలు ఉన్నాయి. కొన్ని ఆదీవాసీ ప్రతిఘటనలు ఉన్నాయి, కొన్ని ఆత్మగౌరవ ప్రతీకలూ ఉన్నాయి. కొన్ని ఎమర్జెన్సీ చీకటి రోజుల దుర్మార్గాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య దగ్ధమైన జీవితాలు నెరవేర్చుకోలేని స్వప్నాలూ ఉన్నాయి. మానేరు చుట్టూ తిరిగిన జీవితాలు అవి కేవలం ప్రాంతీయ జీవితాలు కాదు. అవి తెలంగాణలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ప్రతి నది చుట్టూ, పరిభ్రమించిన జీవితాలు.
‘‘సమూహం కాని వాడు శాపగ్రస్తుడే. ప్రపంచం కాని ప్రతి వాడు నిలవనీరే’’ అన్న నిశ్చితాభిప్రాయం కల జూకంటి కవిత్వం చదివితే ప్రజల జీవన సంఘర్షణలో మమేకమైన ప్రతి గొప్ప కవి ఇలాగే రాస్తారా అనిపిస్తుంది. ఆయన సిరిసిల్ల కవి కాదు. సిరిసిల్ల నుంచి ఆయన వినిపించింది ప్రాంతీయ గొంతుక కాదు. అది చరిత్ర నిర్మాతల గొంతు. అది జైత్రయాత్రల స్వరం. ప్రజల పద ధ్వనుల్లో జనించిన గానం. ప్రపంచీకరణ బలిపీఠంపై సిరిసిల్లను చూసిన విలాపం.
నువ్వుల నుంచి నూనె తీసే విద్య తెలిసిన జూకంటి, పెరిగిన నాగరికత కనపడకుండా చేసిన గుండె గాయాలకు కులవృత్తే ఓదార్పుగా జీవించిన జూకంటి, తల్లి కట్టిన ఇస్తరాకుల కట్టలను నెత్తిమీద పెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్మిన జూకంటి, గానుగకూ, కనెంకూ మధ్య అసిరి నడిపి తమ్ముని వేలు నలిగి రక్తంతో తడిసిన నువ్వుల పిండిని మరిచిపోని జూకంటి ప్రజల జీవిత సంఘర్షణను తన జీవిత సంఘర్షణతో మమేకం చేసి కవిత్వం అనే తైలంతో అక్షర దీపాల్ని వెలిగిస్తున్న ప్రజా కవి. తెలంగాణలో చరిత్ర అనేక మలుపులు తిరుగుతున్నా, ఆరున్నర దశాబ్దాలుగా ప్రతి మలుపులోనూ ఉండి, ఆ మలుపుకు కేంద్ర బిందువైన నేలను వదులుకోకుండా అక్కడి నుంచి ప్రపంచాన్ని దర్శిస్తున్న ఒక మహావృక్షం జూకంటి జగన్నాథం.
హరికథలు, పటం కథలు, భాగోతాలు, టీచర్ల పాఠాలు, దోస్తానాలు, గానుగ తిప్పుళ్లు, కూలి పనులు, బావులు తవ్వుడులు, వరికోతలు, కాల్వలు తీయడాలనుంచి వచ్చిన కవి మాత్రమే కాదు; కళ్ల ముందు ఊళ్లు ఖాళీ కావడాలు, మనుషులు శవాలుగా మారడాలు, దుబాయ్‌కో బొంబాయికో పారిపోయిన జీవితాలు, మార్కెట్‌ సృష్టించిన భీభత్సాల నుంచి వచ్చిన కవి కూడా ఆయన. కాలేజీ మెట్లను ఎక్కని ఎండకాలం చదువైతేనేం, ఆయన సిరిసిల్ల గాంధీ చౌక్‌లో బెదిరిన మనుషుల ముఖాలపై లిపిని కూడబలుక్కునే కవి. మానేరు వంతెనైనప్పుడు ఊరంతా సిరిసిల్లకు బతుకమ్మలా కదిలె అన్న జూకంటి, క్షణ క్షణమూ ఇరుకవుతున్న బతుకు రహదారిపై ఒంటరి ప్రయాణీకుడిని మోస్తున్న బోసి బస్టాండ్‌ అయిపోతాడు ఒకోసారి. ఆ పాన్‌ డబ్బా చాటునో ఆ మార్కెట్‌ మూలమీదో లక్ష్మీ విలాస్‌ స్తంభం పాటు టేబుల్‌ పక్కనో కవిత్వం చదువుకుని చాయ్‌ తాగి వెళ్లిపో యిన కరస్పర్శల్ని ఆయన మరిచిపోలేడు. ఎన్ని జీవితాలు భీవండి బస్సులై పోయాయో ఆయన మనసుకు తెలుసు. నిశ్చలమైన చెరువు రాళ్లలో రాయి విసిరినట్లు ఎన్ని డీజిల్‌ జీపులు జనం జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూ చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోయాయో ఆయనకు తెలుసు. ఎంత దుఃఖించినా కనిపించని అశ్రువులు ఆయన గుండెల్ని చెరువు చేస్తుంటాయి. ఎన్నడూ పేజి తిప్పని ఎడ్డిబాగుల జీవితాలు దిక్కుతోచని లోతు చూపులు ఆయనను తాకుతుంటాయి. ‘‘రోజూ మధ్యాహ్నం బస్సు పోయి వచ్చినంత వేగంలో కనీసం ఆవగింజంతయనా ఇక్కడి మనుషులు జీవితం ముందుకు కదిలినా బాగుండేది అనుకుంటాడు’’ ఆయన ప్రతి రోజూ. జూకంటి కళ్లలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు తగులబడి పోతున్న దేశం దహన కాండ జ్వాలలు మెరుస్తుంటాయి. శవంపై పేలాలు ఏరుక్కునే వ్యవస్థపై ఆయన నిత్యం దహించుకుపోతుంటాడు. ‘‘మనిషినైనందుకు నాకు నేనే సిగ్గుతో కుమిలిపోతున్నాను కవినైనందుకు రాజ్యాన్ని ద్వేషిస్తున్నాను’’ అని ధైర్యంగా చెప్పగల నిజమైన కవి జూకంటి.
‘‘బతుకà±

Related Keywords

, World Black , Telangana History , His Mind , Village Market , Place His , Kongu Ave , உலகம் கருப்பு , அவரது மனம் , கிராமம் சந்தை ,

© 2025 Vimarsana