ఇండియా న్యూస్ నెట్వర్క్- న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు సమానత్వం, న్యాయం కోసం వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని ఐద్వా తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితులను వినియోగించుకొని దేశ ప్రజల మధ్య విభేదాలను సృష్టించేందుకు బిజెపి - ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించింది. ఈ మేరకు ఐద్వా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత రెండు దశాబ్ధాలుగా ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన సామ్రాజ్యవాద అమెరికా ఆ దేశ ప్రజలను నిలువుగా మోసం చేసిందని విమర్శించింది.