వాషింగ్టన్ : ఆప్గనిస్తాన్లో తాలిబన్లు పలు ప్రావిన్సులను ఇప్పటికే తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆదివారం రాజధాని నగరం కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశించారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, అక్కడి అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్తలను హెలికాఫ్టర్ల ద్వారా తరలించినట్లు చెప్పింది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తూనే..అక్కడి పౌరులను తరలించేందుకు భారీగా బలగాలను పంపుతామని హామీనిచ్చారు. ఈ మిషన్ను అడ్డుకుంటే సహించలేది లేదని తాలిబన్లను శనివారం వార్నింగ్ ఇచ్చారు.