Live Breaking News & Updates on இல்லை உயர் நீதிமன்றம்

Stay informed with the latest breaking news from இல்லை உயர் நீதிமன்றம் on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in இல்லை உயர் நீதிமன்றம் and stay connected to the pulse of your community

అక్కడ ఇసుక నిల్వ చేయలేదు: ఏఎంఆర్‌డీఏ

అక్కడ ఇసుక నిల్వ చేయలేదు: ఏఎంఆర్‌డీఏ
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

India , Amravati , Maharashtra , No-high-court , High-court-public , இந்தியா , அமராவதி , மகாராஷ்டிரா , இல்லை-உயர்-நீதிமன்றம் ,

正念到法院为法官普法 【明慧网】

正念到法院为法官普法 【明慧网】
minghui.org - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from minghui.org Daily Mail and Mail on Sunday newspapers.

Dafa , Hainan , China , Vietnam , Republic-of , Yongkang , Yunnan , Falun-gong , School-law , I-press , No-high-court , Province-high-court

कलकत्ता HC के फैसले पर बोलीं स्मृति ईरानी, TMC कार्यकर्ताओं ने BJP महिला कार्यकर्ताओं के साथ किया दुष्कर्म और दीदी कहती हैं 'खेला होबे'

कलकत्ता HC के फैसले पर बोलीं स्मृति ईरानी, TMC कार्यकर्ताओं ने BJP महिला कार्यकर्ताओं के साथ किया दुष्कर्म और दीदी कहती हैं 'खेला होबे'
prabhasakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prabhasakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Calcutta , West-bengal , India , Mamata-banerjee , Smriti-irani , Calcutta-high-court , No-high-court , High-courta-state , Central-secretary-smriti-irani , Her-report , High-court , கால்குட்டா

అమరావతిలో అంతా ఓకే


అమరావతిలో అంతా ఓకే
రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేనేలేదు!
భూముల క్రయవిక్రయాలపై హైకోర్టు తీర్పు సక్రమమే
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
విస్తృతంగా విచారణ తర్వాతే నిర్ణయం
దాని పరిశీలనల్లో ఎలాంటి వక్రతా లేదు
అమ్మినవారికి ఏ నష్టమూ జరగలేదు
కొనుగోళ్లలో మోసం ప్రశ్నే లేదు
ఎందుకు కొంటున్నామో చెప్పాలని లేదు
హైకోర్టులో దీనిపై సర్కారు వాదించలేదు
అప్పీల్‌కు ఇదే కారణమని చెప్పలేదు
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై హైకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో పేర్కొన్న పరిశీలనల్లో వక్రత లేనేలేదు. 
భూ లావాదేవీల్లో ఏ విక్రయదారుడికీ నష్టం జరగలేదు. కొనుగోలుదారులు మోసం చేసిన ప్రశ్నే లేదు. భూములు ఎందుకు కొంటున్నదీ చట్ట ప్రకారం కచ్చితంగా చెప్పాలని లేదు. - సుప్రీంకోర్టు
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. దాని పరిశీలనల్లో ఎక్కడా తప్పులేదని తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న జగన్‌ ప్రభుత్వ వాదన వీగిపోయింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదని తేల్చి.. పలువురిపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సక్రమంగానే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. సెక్షన్‌ 418కి సంబంధించి ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది చేసిన వాదన ఇక్కడ వర్తించదని తన తీర్పులో స్పష్టం చేసింది ‘భూ కొనుగోళ్లలో ఏ విక్రయదారుడికీ నష్టం జరగలేదు. కొనుగోలుదారులు మోసం చేసిన ప్రశ్నే లేదు. భూములు ఎందుకు కొంటున్నదీ చట్ట ప్రకారం కచ్చితంగా చెప్పాలని లేదు. ఈ కోణంలో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించలేదు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ దానిని కారణంగా చూపలేదు’ అని పేర్కొంది. హైకోర్టు విస్తృతంగా విచారణ జరిపిందని, తన పరిశీలనల్లో వక్రత లేదని తేల్చిచెప్పింది. 
సేల్ డీడ్‌పై వివాదమే లేదు: లుథ్రా
మరో ప్రతివాది గుడ్‌లైఫ్‌ ఎస్టేట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్‌ 418ను చేర్చలేరని తెలిపారు. సెక్షన్‌ 415కు సంబంధించిన అంశాలు సరిపోలినప్పుడే సెక్షన్‌ 418 వర్తిస్తుందన్నారు. దుర్వినియోగం జరిగినప్పుడు సెక్షన్‌ 415 వర్తిస్తుందని, కానీ ఈ కేసులో ఈ సెక్షన్‌ వర్తించదని హైకోర్టు తీర్పులో పేర్కొందన్నారు. విక్రయదారు, కొనుగోలుదారు మధ్య రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ఉందని, గత ఆరేళ్లుగా సేల్‌డీడ్‌పై ఎక్కడా వివాదం లేదని గుర్తు చేశారు. ‘‘అకస్మాత్తుగా ఎవరో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం మారిందని దవే అన్నారు. అసలీ కేసులో ప్రభుత్వం మారడమే సమస్య. అది మారిన తర్వాత తొందరపాటు (ఫ్లర్రీ) ప్రాసిక్యూషన్‌ను మొదలుపెట్టారు’ అని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల మధ్య ఒప్పందం ఉన్నప్పుడు సెక్షన్‌ 415 ఎలా వర్తిస్తుందని అడిగారు. భూకొనుగోళ్లలో వివాదం ఉందంటూ ఎవరూ రిజిస్ట్రార్‌ను అశ్రయించలేదని ప్రస్తావించారు. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారమే భూలావాదేవీలు జరిగాయని తేల్చిచెప్పారు. రాజధాని అమరావతికి సంబంధించి జరిగింది భూసేకరణ కాదని.. అది భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) అని గుర్తుచేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో పబ్లిక్‌ డొమైన్‌లో ఉందని హైకోర్టు కూడా గుర్తించిందన్నారు. రాజధాని ఏర్పాటుపై 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులోనూ చర్చ జరిగిందన్నారు. ఆ ఏడాది అధికారంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టోలో కూడా పేర్కొందని, వార్తల్లోనూ రాజధానిపై చర్చ జరిగిందని వివరించారు. కాబట్టి ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55 ప్రకారం.. విక్రయదారుడికి కొనుగోలుదారు ఈ విషయాన్ని వెల్లడించలేదనడం సరికాదన్నారు. ‘భూమి విలువ పెరిగిందంటున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అక్కడ ఆస్తుల విలువ పడిపోయింది. ప్రభుత్వం చెబుతున్నట్లు 20 రెట్లు పెరగలేదు’ అని తెలిపారు. ఇది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, ఈ కేసులో ఏ వివాదం లేదని, కాబట్టి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.
అసలు విషయం దాచారు: కుహాడ్‌
భూముల కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు అసలు విషయం దాచారని, ఉద్దేశపూర్వకంగానే రాజధాని విషయాన్ని చెప్పలేదని.. సీఐడీకి ఫిర్యాదు చేసిన సలివేంద్ర సురేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పారస్‌ కుహాడ్‌ తెలిపారు. ‘మీరు సేల్‌ డీడ్‌ కుదర్చుకోలేదు కదా..’ అని ధర్మాసనం ప్రశ్నించగా.. తాము సేల్‌డీడ్‌ను కుదుర్చుకోలేదని, క్రిమినల్‌ మోషన్‌ను ఎవరైనా దాఖలు చేయవచ్చని కుహాడ్‌ బదులిచ్చారు. ఇది ఒక వ్యక్తికి సంబఽంధించిన కేసు కాదని, వేల ఎకరాలతో ముడిపడిన రాజధాని అంశమని తెలిపారు. ఇందులో పెద్ద రాజకీయ నేతల ప్రమేయం ఉందని, నేర తీవ్రతను వాస్తవాలతో తెలియజేశామని, దర్యాప్తు కొనసాగాలని, ఎలా ఆపుతారని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి 2014 జూన్‌ నుంచి పబ్లిక్‌ డొమైన్‌లో ఉందని అంగీకరించారు. అయితే 2014 అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’తో పాటు మరో ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. తుళ్లూరు మండంలోని 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుందని ‘ఆంధ్రజ్యోతి’ పేర్కొందని తెలిపారు. కానీ ఆలోపు జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు కొనుగోళ్లు జరిగాయన్నారు. 2015 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు.
హైకోర్టు తీర్పు నిష్పక్షపాతం: శ్యామ్‌ దివాన్‌
పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న కిలారు రాజేశ్‌, శ్రీహాస తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా, సమతుల్యంగా ఉందన్నారు. వక్రీకరణ లేదని, తీర్పును సవాల్‌ చేయడానికి అసలు కారణమే లేదని స్పష్టం చేశారు. ‘పరిస్థితులు, వాస్తవాల ఆధారంగా కేసులో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుంది. నిరుడు సెప్టెంబరు 7న సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. అక్టోబరు 16న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఫిర్యాదుదారు భూములను విక్రయించినవారు కాదు. విక్రయదారులకు లేని అభ్యంతరం.. ఈ మూడో వ్యక్తికి ఎందుకని హైకోర్టు సరిగ్గా ప్రశ్నించింది. భూలావాదేవీలు జరిగిన 6 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారు. దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నప్పుడు ఇందులో మోసం, విశ్వాస ఘాతుకం ఎక్కడుంది? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఇక్కడ ఆస్కారమే లేదు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఐపీసీ సెక్షన్‌ 418, ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55 వర్తింపుపై వాదించాలని సూచించింది. దివాన్‌ వాదనలు కొనసాగిస్తూ.. ‘ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 420, 409, 406, 120బీలను చేర్చారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తే సెక్షన్‌ 418 వర్తిస్తుంది. అయితే ఇక్కడా పరిస్థితి లేదు. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55 కూడా ఇక్కడ వర్తించదు. హైకోర్టు తన తీర్పులో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని సెక్షన్లనూ కూలంకషంగా చర్చించింది. రాజధాని విజయవాడ-గుంటూరు ప్రాంతాల్లో వస్తుందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ పరిణామాల రీత్యా భూకొనుగోళ్లకు సంబంధించి సివిల్‌ ఒప్పందం జరిగి ఆరేళ్లు గడచిన తర్వాత మూడో వ్యక్తి ఎవరో ఫిర్యాదు చేస్తే క్రిమినల్‌ చర్యలను ప్రారంభించడం సరికాదు’ అని తెలిపారు. స్పందించిన దవే.. సెక్షన్‌ 154 ప్రకారం ఏ వ్యక్తి అయినా నేరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. రాజధాని ఏర్పాటుపై 2015 ఏప్రిల్‌ 23న రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ‘2014 భూలావాదేవీలపై 2020లో ఎందుకు ఫిర్యాదు చేశారని దివాన్‌ అడిగారు. 2019లో ప్రభుత్వం మారింది. అందుకే అప్పుడు ఫిర్యాదు వచ్చింది. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి దీనిని ఆలస్యమని అనలేం’ అని అన్నారు. దాంతో న్యాయమూర్తులు పెద్దగా నవ్వారు.
సెక్షన్‌ 418ని పరిగణనలోకి తీసుకోలేదు: దవే
విచారణ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో చాలా ముఖ్యమైన ఐపీసీ సెక్షన్‌ 418ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సెక్షన్‌ ప్రకారం.. తెలిసి మరీ మోసం చేయడం నేరం. హైకోర్టు తీవ్రమైన పొరపాటు చేసింది. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55ను తీర్పులో ప్రస్తావించింది. కానీ అదే సెక్షన్‌లోని సబ్‌ క్లాజ్‌ 5(ఏ) ప్రకారం.. భూముల విలువ పెరుగుదలకు సంబంధించి విక్రయదారులకు కొనుగోలుదారులు వెల్లడించాలి. ఈ సెక్షన్‌లో ఇదే ముఖ్యమైన కోణం. కానీ ఈ అంశాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు. ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్ల.. రాజధాని కచ్చితంగా ఎక్కడ వస్తుందోనన్న సంగతి కొనుగోలుదారులకు ముందే తెలుసు. విక్రేతలకు తెలియదు. ప్రచారం జరిగినా, ముందే ఊహించినా కచ్చితంగా ఎక్కడ వస్తోందో కొన్నవారికి తెలుసు. విక్రయదారులకు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందే. లేదంటే మోసం చేసినట్లవుతుంది. అప్పుడు ఐపీసీ సెక్షన్‌ 418 వర్తిస్తుంది. ఆస్తుల బదిలీ చట్టంలోని సెక్షన్‌ 55లోని సంబంధిత అంశాన్నీ హైకోర్టు విస్మరించింది. సెక్షన్‌ 482ను ఉపయోగించుకుని ప్రతి ఫిర్యాదుకూ సంబంధించి పోలీసుల, ట్రయల్‌ కోర్టుల అధికారాలను తీసుకోడానికి భజన్‌లాల్‌ కేసు హైకోర్టులకు లైసెన్సు కాదు. ట్రయల్‌ జరుగుతున్నప్పుడు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం నిందితుల హక్కు. కానీ ప్రాథమిక స్థాయిలోనే హైకోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తును నిలిపివేయడం సరికాదు. సివిల్‌ వివాదమైనంత మాత్రాన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేయరాదనడం కుదరదని గతంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మేం (రాష్ట్రప్రభుత్వం) ఇప్పుడు ఎవరినీ దోషిగా తేల్చడం లేదు. దర్యాప్తును కొనసాగనివ్వాలి. అసాధారణ కేసుల విషయంలో హైకోర్టుకు కొన్ని పరిమితులు ఉంటాయి. హైకోర్టు తీర్పులో రాజ్యాంగ హక్కులు అని ఒక చోట ప్రస్తావించారు. క్రిమినల్‌ కేసుతో రాజ్యాంగ హక్కులకు సంబంధం ఏమిటో? నేరం జరిగిందా లేదా అన్నది ట్రయల్‌, దర్యాప్తు తేల్చుతాయి. నిందితులు నిర్దోషులు కావచ్చు. కానీ ఆ విషయాన్ని దర్యాప్తు, ట్రయల్‌ కోర్టు తేల్చాలి. ఈ భూలావాదేవీలు చట్టపరంగా మోసపూరితం’ అని పేర్కొన్నారు.

New-delhi , Delhi , India , Amravati , Maharashtra , Guntur , Andhra-pradesh , Supreme-court , No-high-court , High-court-her , Land-high-court

'ఇన్‌సైడర్‌' వాదనకు ప్రాతిపదిక లేదు


‘ఇన్‌సైడర్‌’ వాదనకు ప్రాతిపదిక లేదు
హైకోర్టు తీర్పులో తప్పేముంది?
రాజధాని భూముల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
క్రిమినల్‌ కేసును సివిల్‌ కేసులో చేర్చలేమని స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్ల కేసుల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అన్ని కోణాల్లో విచారించే... ఈ కేసును హైకోర్టు కొట్టేసినట్లు కనిపిస్తోందని.. మీ వాదనకు సరైన ప్రాతిపదిక ఏమీ కనిపించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించి చెక్క గురుమురళీమోహన్‌ తదితరులపై వెలగపూడికి చెందిన సరివేంద్ర సురేష్‌ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు నమోదుచేసింది. వాటిపై గురుమురళీమోహన్‌, ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా.. అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలుచేసింది. పిటిషన్‌పై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిట్‌ దర్యాప్తును హైకోర్టు నిలిపివేసింది. ఇదే అంశంపై మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌, న్యాయవాది సుఘోష్‌ సుబ్రహ్మణ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది క్రిమినల్‌ కేసు, అది సివిల్‌ కేసు అని... రెండింటినీ ఎలా కలుపుతారని ప్రశ్నించారు. రెండింటినీ కలపబోమని, దీనిపై విడిగా విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పగా అందుకు దవే అంగీకరించి, వాదనలు కొనసాగించారు. ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని భూములు కొన్నారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు, ఉన్నతాధికారులు ఉన్నారు. సిట్‌ దర్యాప్తు కొనసాగనివ్వాలి. ఏమీ జరగలేదని తేలితే ఏ ఇబ్బందీ లేదు. ఈ దశలో ఎవరినీ దోషులుగా తేల్చడం లేదు. పౌరులపై కేసులు నమోదు చేయడం లేదు. దర్యాప్తు కొనసాగాలని మేం భావిస్తున్నాం’ అని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘హైకోర్టు తీర్పును సవాలు చేసే ప్రాతిపదిక ఏమీ కనపడటం లేదు. మీరు చెప్పే కారణాలేంటి? మీ పిటిషన్‌ను పరిశీలిస్తే హైకోర్టు ఇలా చేయకూడదనే కారణాలే మీరు చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించింది. దవే స్పందిస్తూ.. భూ సేకరణ అక్రమాలను తీవ్రంగా పరిగణించి విచారణ చేయించాల్సిన అవసరం ఉందంటూ హరియాణాకు చెందిన ఓ కేసులో జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం అనుమతించిందని, సుప్రీంకోర్టు పలుమార్లు ఇలాంటి తీర్పులు ఇచ్చిందన్నారు. కేసు తొలిదశలోనే హైకోర్టు జోక్యం చేసుకొని తుది నిర్ణయానికి వచ్చిందని, విచారణ అంశాల్లో హైకోర్టు జోక్యం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలు ఆధారాలను ట్రయల్‌ కోర్టు, హైకోర్టు ముందు పెట్టినప్పుడు తుది నిర్ణయానికి రావచ్చని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని కీలకమైన వ్యక్తులు అధికారిక రహస్యాలు తెలుసుకొని తమకు అనుకూలమైన వారికి ముందే తెలియజేసి లబ్ధి కలిగేలా చేశారని ధర్మాసనానికి విన్నవించారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం పబ్లిక్‌ డొమైన్‌లోనూ, పత్రికల్లోనూ ముందే రాజధాని ప్రాంతంపై వార్తలు వచ్చాయని హైకోర్టు తీర్పులో ఉందని.. అలాంటప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో అన్నారని, అమరావతి ప్రాంతం పేరు తెలపలేదని దవే బదులిచ్చారు. మీరు చెప్పే తీర్పుల వివరాలు కావాలని ధర్మాసనం చెప్పగా తనకు కొంత సమయం కావాలని దవే కోరారు. మధ్యాహ్న భోజన అనంతరం అందజేస్తామని, వాదనలు వినిపించేందుకు తనకు గంట సమయం కావాలని విజ్ఞప్తిచేశారు. మధ్యాహ్నం తమకు వేరే కేసులు ఉన్నందున సోమవారం విచారణ చేపడతామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
Tags :

Dilli , Delhi , India , Amravati , Maharashtra , Supreme-court , No-high-court , High-court , Amravati-region , டில்லி , டெல்ஹி

Uttarakhand High Court Told Government For Consider Withdrawing Exemption In Covid Curfew On Weekends At Tourist Places - उत्तराखंड: वीकेंड पर पर्यटन स्थलों पर बढ़ रही भीड़ पर हाईकोर्ट ने जताई चिंता, कहा- कर्फ्यू में छूट पर दोबारा विचार करे सरकार

Uttarakhand High Court Told Government For Consider Withdrawing Exemption In Covid Curfew On Weekends At Tourist Places - उत्तराखंड: वीकेंड पर पर्यटन स्थलों पर बढ़ रही भीड़ पर हाईकोर्ट ने जताई चिंता, कहा- कर्फ्यू में छूट पर दोबारा विचार करे सरकार
amarujala.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from amarujala.com Daily Mail and Mail on Sunday newspapers.

Mussoorie , Uttaranchal , India , Nainital , Delhi , Uttarakhand , Himachal-pradesh , Chhattisgarh , Amar-ujala , Juna-amar-ujala , Amit-nagy , Coronaa-delta

రుయా ఘటనకు..బాధ్యులెవరు?


రుయా ఘటనకు..బాధ్యులెవరు?
సిబ్బంది నిర్లక్ష్యమా.. ఆక్సిజన్‌ వాహనం ఆలస్యం కారణమా?
ఆ మరణాలకు కారణమేంటి?
కలెక్టర్‌, ఆస్పత్రి డాక్టర్ల నివేదికలను మా ముందుంచండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పరిహారం వ్యాజ్యంలో నోటీసులు
అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధికారులు, వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణాలు చోటు చేసుకున్నాయా లేక ఆక్సిజన్‌ తెచ్చే వాహనం రావడం ఆలస్యమవడం వల్ల  బాధితులు మరణించారా అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 40మందికి పైగా కోవిడ్‌ బాధితులు చనిపోయారని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదుకు ఆదేశాలివ్వాలని తిరుపతి టీడీపీ నేత పవార్‌ మోహన్‌రావు పిల్‌ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ‘ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ ప్లాంటు దగ్గర్లోనే ఉన్నా అధికారుల సమన్వయ లోపం వల్ల కొవిడ్‌ బాధితులు చనిపోయారు.
ఈ విషయంపై నిజాలు తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేలా పోలీసులను ఆదేశించండి. వివక్ష లేకుండా బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి’ అని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనం ఆలస్యంగా రావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని.. ఆక్సిజన్‌ అందక 23 మంది  బాధితులు మృతి చెందారని.. ఘటనపై ఆస్పత్రి డాక్టర్లు, చిత్తూరు కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారని తెలిపారు. వాటి ఆధారంగా మరణాల కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయం తేల్చాల్సిన అవసరం ఉందని. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
25 లక్షల పరిహారమివ్వాలి..
రుయా ఆస్పత్రి ఘటనలో మృతి చెందినవారి బంధువులకు అందించే పరిహారాన్ని పెంచాలంటూ తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదనలు వినిపిస్తూ... పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని కోరారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ గోస్వామి, జస్టిస్‌ జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Gopal-kalanidhi , No-high-court , High-court , Tirupati-hospital , Chittoor-district , இல்லை-உயர்-நீதிமன்றம் , உயர்-நீதிமன்றம் , சித்தூர்-மாவட்டம் ,

אביחי מנדלבליט: הכרעת בית המשפט העליון מחייבת ואין בלתה

אביחי מנדלבליט: הכרעת בית המשפט העליון מחייבת ואין בלתה
inn.co.il - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from inn.co.il Daily Mail and Mail on Sunday newspapers.

Israel , Avihay-mandelblitt , Bezalel-smotrich , Avichai-mandelblit , Medinat-yisrael , Yariv-levin , Supreme-court , No-high-court , Court-he , Legal-general-avichai-mandelblit , Medinat-yisra-el , State-israel

Zimbabwe's Mnangagwa tries to wriggle out of Malaba crisis – The Zimbabwe Mail

Zimbabwe's Mnangagwa tries to wriggle out of Malaba crisis – The Zimbabwe Mail
thezimbabwemail.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from thezimbabwemail.com Daily Mail and Mail on Sunday newspapers.

Malaba , Provincia-de-bioko-norte , Equatorial-guinea , Vernanda-ziyambi , Justice-happias-zhou , Justice-erica-ndewere , Justice-elizabeth-gwaunza , Emmerson-mnangagwa , George-smith , Ahmed-ebrahim , Supreme-court , Judicial-service-commission

זעם בימין על הביקורת של בג"ץ נגד הכנסת: "פסיקה מזעזעת, הפיכה שלטונית"

זעם בימין על הביקורת של בג"ץ נגד הכנסת: "פסיקה מזעזעת, הפיכה שלטונית"
inn.co.il - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from inn.co.il Daily Mail and Mail on Sunday newspapers.

Israel , Aaron-barak , Ayelet-shaked , Bezalel-smotrich , Gideon-saar , Medinat-yisra-el , Yariv-levin , Junior , Supreme-court , No-high-court , High-court , Act-basic